Devotional

devotional

Subcategories

సోమవారం శివపూజ …శివానుగ్రహంశివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూ..
శ్రీ ఆదిశంకరాచర్య విరచితశ్రీ లలితా పంచరత్న స్తోత్రం(1) ప్రాతః స్మరామి లలితావదనారవిందంబింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్||(2) ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీంరక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |మాణిక్యహేమవలయాంగదశోభమానాంపుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||(3) ప్రాతర్నమామి లలితాచరణారవిందంభక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |పద్మాసనాదిసురనాయకపూజనీయంపద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||(4)ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీంత్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||(5)..
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిశ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్..
నేడు బుధవారం పుత్ర గణపతి వ్రతం పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు.వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం.ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి … గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సా..
ఈ రోజు (సోమవారం 11-03-2024) నుంచి ఏప్రిల్ 8-2024 వరకూ ఫాల్గుణమాసం.ఫాల్గుణ మాసం సర్వదేవతా సమాహారం. తిథుల్లో ద్వాదశి మణిపూస లాంటిది. సంఖ్యాపరంగా పన్నెండుకు ఒక ప్రత్యేకత ఉంది. సూర్యుడికి 12 పేర్లున్నాయి. సంవత్సరానికి 12 మాసాలు. ఫాల్గుణం పన్నెండోది. దాని తర్వాత కొత్త ఏడాది మొదలవుతుంది. ప్రకృతికంగా స్త్రీలకు పన్నెండో ఏడు, సమాజపరంగా విద్యార్థులకు పన్నెండో తరగతి ప్రధానం.ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశిగా ప్రసిద్ధం. ఈ ద్వాదశిని గోవింద ద్వాదశి అని, విష్ణుమూర్తికి ప్రియమైన ఉసిరి పేరుతో అమలక ద్వాదశి అని పిలుస్తారు. ఫాల్గుణ బహుళ పాఢ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరామచంద్రుడు లంకకు బయల్దేరాడన..
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
మల్లన్న పెళ్లికి నేతన్న ‘తలపాగా’ మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల ఆచారం శ్రీశైలం మల్లన్న కల్యాణానికి ముహూర్తం ముంచుకొస్తోంది. పెళ్లికోసం తలపాగా సిద్ధమైంది. శివరాత్రి రోజున చీరాల నేతన్న నేసిన తలపాగాను చుట్టిన తర్వాతే పెళ్లితంతు మొదలవుతుంది. ఈ అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం. ఈ ఆచారం మూడు తరాలుగా వస్తోంది. ఇదీ తంతు.. : ఏటా శివరాత్రి రోజు శ్రీశైలం మల్లన్న కల్యాణం జరుగుతుంది. ఆయనను వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ చేస్తారు. శివరాత్రి లింగోద్భవ సమయంలో రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య కల్యాణం నిర్వహిస్తారు. ఇందుకు గాను చీరాలలో తయారు చేసిన చేనేత వస్..
మహాశివ రాత్రి పూజా విధానం .జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ !    ఉష ఋణేన యాతయ !!మహాశివరాత్రి వ్రతా..
సప్త ఋషులు:ఈరోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు?అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..కశ్యప అత్రి భరద్వాజవిశ్వామిత్రోథ గౌతమః!వశిష్టో జమదగ్నిశ్చసప్తైతే ఋషయః..
జ్ఞాని భక్తుల కలయికభగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం మహారాష్ట్రభాషలో ఉంది. దాన్ని రచించిన మహాపండితుడు జ్ఞానేశ్వరుడు. అద్భుతమైన మహిమలుగల వాడాయన. మహాభక్తుడైన నామదేవుడు కూడా ఆయన కాలంవాడే కావడం చరిత్రలో అద్భుతమైన ఘటన. ఆయన నిరంతరం శ్రీ పాండురంగని భజిస్తూ ఉండేవాడు. నామసంకీర్తనంతో కాలం గడిపేవాడు. ఒకనాడు జ్ఞానేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి "అయ్యా! భగవద్భజన ఎలా చెయ్యాలి? మనస్సు - బుద్ధి సాత్త్విక స్థితికి ఎలా వస్తాయి? శ్రవణభక్తిలోని రహస్యం ఏమిటి? భక్తి ధ్యానాలకుగల తారతమ్యం ఏమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.ఆ ప్రశ్నలు వినడంతోటే నామదేవుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అతని కంఠం డగ్గుత్తికపడింది. ..
Showing 41 to 50 of 879 (88 Pages)