Devotional

devotional

Subcategories

కార్తీకం కార్తీక మాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.. ఈరోజు విశేషామైన  ఆలయం.. శ్రీ భిక్షేశ్వరుడు - శ్రీ గౌతమేశ్వర ఆలయం...( కరీంనగర్ జిల్లా మంథని  ) పురాతనకాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఎందరో  వేద పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకుటం లేదా మంత్రపురి పిలిచేవారు మంథని క్షేత్రానికి అనాది నామం "మంత్రకూటం". అనగా ఈ క్షేత్రం "దివ్య మంత్రాల కూటమి". అసలు ఈ క్షేత్రం గొప్పదనం వివరించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి....ఎందుకంటే...విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే  అందులో ..
అయ్యప్ప దీక్షా కాలంలో సందేహాలు*ఇరుముడి అంటే ఏమిటి ? దాని అంతరార్థము ఏమిటి?*ఇరుముడి అంటే రెండు ముడులనియు, ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మపండు, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు మూడు పెడతారు.రెండవ భాగములో ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వగైరాలు రైక (జాకెట్) ముక్కలు పెడతారు.“భక్తి”,“శ్రద్ధ” అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి,   శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికం..
కార్తీక మాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము..ఈరోజు విశేషామైన  ఆలయం.....శ్రీ ఎండల మల్లిఖార్జునస్వామిఆలయము , రావివలస  గ్రామం,శ్రీకాకుళం......!! పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటివి లేవు. ఇంకా ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా గుర్తింపు పొందింది. మరి ఇక్కడి శివలింగాన్ని ఎండల మల్లికార్జునుడు అని ఎందుకు పిలుస్తారు,ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకాకుళం జిల్లా, టెక్కలికి కొంత దూరంలో రావి వలస గ్రామంలో ఎండల మల్లికార్జునుడు..
 నాగుల చవితి నాగన్నారాయి, రప్ప, చెట్టు, పుట్టనేగాక అనేక జీవరాశులను దైవంగా భావించి ఆరాధించడం హైందవ సంస్కృతిలో భాగం. ప్రకృతిని దైవంగా భావించే మనం ప్రకృతిలో మమేకమై జడ, జీవపదార్థాలను సైతం దైవంగానే భావిస్తాం. భారతీయ సంస్కృతి విశిష్టత ఇదే. ఈ క్రమంలోనే నాగులను దేవుళ్లుగా పూజిస్తాం. కార్తిక శుద్ధ చతుర్థిని నాగులచవితిగా పండుగ చేసుకుంటాం. కొన్ని చోట్ల శ్రావణ శుద్ధ చవితి నాడు ఈ పండుగ చేసుకుంటారు.నాగులచవితి నాడు సూర్యోదయానికి ముందుగానే మహిళలు స్నానాదులు ముగించుకొని పుట్ట దగ్గరికి వెళ్తారు. పుట్ట చుట్టూ పసుపురాసిన నూలు దారాలు చుట్టి, ప్రమిదలు వెలిగించి, పుట్టపై పసుపు కుంకుమ చల్లుతారు. నాగదేవతను ..
నాగుల చవితి విశిష్టత ఏమిటి ? | Nagula Chavithi 2024 | Nagula Panchami 2024 |  Pooja Vidhanam in TeluguNovember 4th - నాగుల చవితిNovember 5th - నాగుల పంచమి నాగుల చవితి వెళ్లిన మరునాడే ఈ నాగ పంచమి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే భక్తులు.. ఈ రెండు రోజులు నాగుల పుట్టలో పాలు పోస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకాలు నిర్వహించడం మంచిది. నాగులకు.. అంటే పాములకు పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక మాసంలో శుక్ల పక్షం చవితి తిథి రోజున ఈ నాగుల చవితి వస్తుంది. ఈ రోజు నాగ దేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్ప భయాలను తొలగించు కోవచ్చు. అలాగే సంతాన సిద్దితోపాటు క..
కార్తీక మాస విధులు  కార్తీకము బహుళార్థసాధకముగా  శివ కేశవ జగన్మాతలను,  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని యధాశక్తి పూజించుట ప్రధానము.     ఆసక్తి, శక్తి కలిగినవారు.... ఈ మాసమంతా దీక్ష అవలంబించడం, మాసమంతా నక్త భోజన వ్రతమును ఆచరించటం ఉత్తమము.     ఈ మాసమంతా......1) సూర్యోదయానికి పూర్వమే కార్తీకస్నానం సంకల్పయుతముగా..2) కార్తీక దీప ప్రజ్వలన ప్రాతః సాయంకాల ఉభయ సంధ్యలలో.3) శక్తిమేరకు శివ అభిషేకమో, ఇష్టదేవతా అనుష్ఠానమో, అర్చనో, జపమో, పూజ నామపారాయణమో, అవశ్యం దానము అనుసరణీయమే.4) "కార్తిక్యామిందువారేతు:స్నాన దాన జపాదికం  |అశ్వమేధ సహస్రాణాం ఫలం ..
కార్తీకమాసం విశిష్టత  : ప్రాతఃకాల స్నానదానాదులతో - కార్తీక స్నానాలు ప్రారంభం♪. కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది♪. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం♪. ఈ మాసంలో వచ్చే... ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి, పుణ్యఫలం చేకూరుతుంది♪.  కార్తీక మాసం మొత్తం మీద - కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది♪. అందుకే ఈ రెండు తిథుల్లో, వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువ చేస్తుంటారు♪. కార్తీకమాసం అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడద..
కలియుగ వరదుడు అయ్యప్ప....!!ఈ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయకపోయినా భగవంతుని నామస్మరణ చేసి తరించవచ్చని మన పెద్దలు చెప్పేరు. భగవన్నామ స్మరణ చేయమని చెప్పడం సులువే కానీ ఏకాగ్రతతో, భక్తి తన్మయత్వంతో చేయడం అంత సులువైన పనికాదు.మానవాళిలో భక్తితత్పరతను పెంచడానికి మన మహర్షులు పూజలు, భజనలు చేయమని, తరచు దేవాలయాలకు, పుణ్యతీర్ధాలకు వెళ్ళమని ఆదేశించారు.దైవభక్తిని పెంపొదించడానికి కొన్ని రకాల దీక్షలను ప్రతిపాదించి, భక్తితో దీక్ష చేసి యాత్రలకు వెళ్ళమన్నారు.దీక్షాకాలంలో పాటించవలసిన కొన్ని నియమాలను చెప్పి భక్తి శ్రద్ధలతో కనీసం మండలకాలం (41 రోజులు) దీక్ష చేసి యాత్రకు వెళ్ళి రమ్మన్నారు.దీక్షలన్నిటిలో స్వామి అయ్యప్..
ర్యాలి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉన్నది.ర్యాలి రాజమండ్రి కి 40 కి.మి., కాకినాడ కు 74 కి.మి., అమలాపురం కి 34 కి.మి. దూరం లో వసిష్ఠ, గౌతమి అనే గోదావరి ఉప పాయ ల మధ్య కలదు. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారి కి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం.స్థల పురాణంజగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, ర్యాలిశ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ..
ప్ర: చండీసప్తశతి ఉగ్రదేవతకు సంబంధించినది కదా!  అలాంటి దేవతల్ని ఆరాధించడం సమంజసమేనా? జ: చండీసప్తశతిలోని దేవి ఉగ్రదేవతకాదు. సర్వశక్తిమయి, సర్వదేవతాత్మిక. కేవలం సాత్త్విక శక్తులైన దేవతలను రక్షిస్తూ, ముల్లోకాలకు క్షేమాన్ని కలిగించే జగన్మాత.  శక్తియొక్క తీవ్రత చండి .   ఇది దుష్టత్వాన్ని దునుమాడే పరమేశ్వరీ స్వరూపం. ఇదే చండీసప్తశతికి 'దేవీమహాత్మ్యం' అనేది అసలుపేరు. లక్ష్మి, గౌరి, సరస్వతి అనబడే సౌమ్యదేవతా రూపాలు కూడా ఆ పరాశక్తి మూర్తులే.  సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే,  యాని చాత్యంత ఘోరాణి తైరక్షాస్మాన్ తథా భువమ్| "అమ్మా! ముల్లోకాలలో ..
Showing 51 to 60 of 1009 (101 Pages)